నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


దయచేసి ఈ బాల కృష్ణుడి బాల్యక్రీడను దృశ్యముగా ఊహించుకుంటూ చదవండి.

ఒకసారి కృష్ణుడు అన్నం తినకుండా మారాం చేస్తున్నాడు. యశోద అన్నం తినమని కృష్ణుడిని బ్రతిమాలుతోంది. కానికృష్ణుడు తినడం లేదు. ఇలా కాదనుకొని అమ్మ యశోద " నీకు ఒక మంచి కథ చెప్తాను. చెప్పనా?" అంది. "ఊ! చెప్పు" అన్నాడు. అమ్మ మొదలు పెట్టింది. "ఒక ఊళ్ళో ఒక రాజు", "ఊ!" అని మళ్ళీ నోరు బిగబట్టుకొన్నాడు. " ఈ ముద్ద తిను, కథ కొనసాగిస్తాను" అంది.

యశొద: ఆ రాజుకు కొడుకులు

కృష్ణుడు : ఊ! ( మూతి బిగబట్టుకొనే)

యశొద : ఒక ముద్ద తిను
కృష్ణుడు : కథ చెప్పు ( మళ్ళీ మూతి బిగించుకొన్నాడు)

యశొద : వారు వేటకు వెళ్ళారు
కృష్ణుడు : ఊ! ( మూతి బిగబట్టుకొనే) అమ్మ కథ చెపుతూనే ఉంది, కృష్ణుడు వింటూ ఊగొడుతూనే ఉన్నాడు. కాని నోరుబిగబట్టుకొని తినకుండా ఉన్నాడు.
అమ్మకు ఆ బుంగమూతి చూసి నవ్వాపుకోలేక ముద్దులతో ముంచెత్తింది.

అలాగే మరోసారి పాలు తాగకుండా మారాం చేస్తున్నాడు. అమ్మ బ్రతిమాలితే కృష్ణుడు అమాయకంగా " అమ్మా! పాలుత్రాగితే
వెంట్రుకలు పెరుగుతాయా?" అన్నాడు. పెరుగుతాయి,త్రాగు అంది అమ్మ.

త్రాగి
వెంట్రుకలును ఒకసారి ముట్టుకొని "అమ్మా! నా వెంట్రుకలు పెరగలేదు. నువ్వు పెరుగుతాయని చెప్పావు" అనిమూతి ముడుచుకొని కూర్చొన్నాడు. అమ్మ అనుకొంది " పిల్లవాడు, వెంటనే వెంట్రుకలు పెరుగుతాయిఅనుకొంటున్నాడు," అనుకొని బాల కృష్ణుడి బుంగమూతి చూసి ఆనందం పట్టలేక,నవ్వు ఆపుకోలేక దగ్గరకుతీసుకొంది.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

కథలను గొలిపెడి ప్రభువుకు
కథలు వినగ కోర్కె కలిగె. కంసాదులు దుర్
వ్యధలను గొలిపెడి సంగతి
కథలుగ యనుకొనుట తెలిసి, కథఁ జెప్పుమనెన్.