నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


శ్రీకృష్ణుడి బాల్యం వింటుంటే ఆహా ఏమి భాగ్యం అనిపిస్తుంది.సాక్షాత్తూ పరమాత్ముడితో ఆడుకొన్న యశోదమ్మదే అదృష్టం కదా. ఇక ఒక సంఘటన చూద్దాం.

శ్రీ కృష్ణుడికి నడక కూడా రాని బాల్య దశలోని సంఘటన.

ఒకరోజు యశోదమ్మ కృష్ణుడిని ఊయలలో పడుకోబెట్టి వంటపని చేసుకొంటోంది.

అప్పుడు కృష్ణుడు పడుకొన్న గదిలోనికి దేవతలు వచ్చారు.

"స్వాగతం శంభో!, వచ్చి ప్రక్కన కూర్చో" అంటూ శివుడిని, "రండి! సృష్టికర్త గారూ! కూర్చోండి" అంటూ బ్రహ్మదేవుడిని, " రావయ్యా మేనల్లుడా!" అంటూ కుమారస్వామినీ, "ఓహో! దేవేంద్రుడు కూడా వచ్చేసారా!" అంటూ అందరినీ ఆహ్వానించసాగాడు.

యశోదమ్మకు కృష్ణుడు పలికిన ఈ మాటలన్నీ వినబడ్డాయి. ఆమె భయపడి కృష్ణుడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. పిల్లవాడు కలవరిస్తే ఏమైనా కలవరించాలి కానీ దేవతలను ఆహ్వానించడమేమిటి అనుకుంటూ పిల్లవాడికి ఏమైనా మంత్రప్రయోగం జరిగిందేమోనని భయపడిపోయింది.

వెంటనే ఊసి ఒక రక్షను కృష్ణుడికి కట్టింది.

ఇది చూసి "ఎల్ల లోకాలకు రక్షకుడు ఐన శ్రీమహావిష్ణువుకే రక్ష కట్టగలిగిన యశోద అదృష్టం ఏమని చెప్పగలము" అంటూ అక్కడ అదృశ్యముగా ఉన్న దేవతలు ఆశ్చర్యపోయారు.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆ యమ యదృష్ట మహిమ ల
మేయము లసదృశములును. సమీకృత కథలన్
వ్రాయుటయు మీ యదృష్టము.
ధ్యేయ మదృష్ట మిది మా యదృష్టము గాదే?