నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే



అర్ధనారీశ్వరతత్వం విషయం మనకు తెలుసు. శివుడు,పార్వతీమాత సగంసగం శరీరం కలిగి ఉంటారని మనకు తెలుసు. అలానే హరిహరమూర్తి తత్వం కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలుసు.


దీని గురించి వివరాలు చూద్దామా.


శ్రీమహావిష్ణువుకు పద్మనయనుడు అనే పేరు ఉంది కదా. ఒకసారి శ్రీహరి పరమశివుడిని వెయ్యి(సహస్ర) తామరపూవులతో పూజించాలని అనుకొన్నాడు. అందుకోసం ఒక వెయ్యి పూవులను సిద్దం చేసుకొని పూజ మొదలుపెట్టాడు. ఇంతలో శివుడు ఒక పుష్పాన్ని మాయం చేసాడు. 999 పూవులు పూజ ఐన తర్వాత ఒక పుష్పం తగ్గిన విషయం చూసిన హరి పూజ నుండి పైకి లేవడం ఇష్టం లేక, తన కళ్ళను పద్మాలు అంటారనే విషయం గుర్తుకు వచ్చి, తన ఒక కన్నునే తామరపూవుగా పెకిలించి పూజ చేసాడు.


విష్ణువు భక్తిని చూసి ముగ్దుడైన పరమశివుడు ఎంతో సంతోషం పొంది సుదర్శన చక్రాన్ని, అలానే తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు. తర్వాతి కాలంలో పార్వతీదేవికి కూడా తన శరీరంలో సగభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు.

0 comments: